‘అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-04-28T18:31:04+05:30 IST

మహిళపై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

‘అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి’

అమరావతి: గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో వివాహిత మహిళపై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వరుస అత్యాచారాలు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి సీపీఎం నిరసన తెలుపుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


Updated Date - 2022-04-28T18:31:04+05:30 IST