YCPపై శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-12-28T16:33:32+05:30 IST
వైసీపీ పార్టీపై సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందసరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం: వైసీపీ పార్టీపై సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానపరుస్తోందని మండిపడ్డారు. రామతీర్ధం కొండపై రాక్షసకాండ జరిగి ఏడాదైనా నిందితులను పట్టుకోలేకపోవటం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో హిందువులను అణచివేస్తోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్ధను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్సీపీ అంటే వైఎస్ఆర్ క్రిష్టియన్ పార్టీ అని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు.