టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి అనర్హుడు: శ్రీనివాసానంద

ABN , First Publish Date - 2021-12-15T18:24:55+05:30 IST

టీటీడీ ధార్మిక సంస్థను వ్యాపార సంస్థగా మార్చేశారని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు.

టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి అనర్హుడు: శ్రీనివాసానంద

తిరుపతి: టీటీడీ ధార్మిక సంస్థను వ్యాపార సంస్థగా మార్చేశారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి అనర్హుడని అన్నారు. టీటీడీ పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్నా పీఠాధిపతులతో చర్చించాలన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో ధర్మాచార సదస్సు వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో గో హత్యలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని, వైఎస్ఆర్ క్రిస్టియన్ పార్టీ అని ఆరోపించారు. అన్నిమతాలను సీఎం జగన్ గౌరవించడం లేదన్నారు. ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేకవిధానాలకు పాల్పడుతున్నారని, టీటీడీని, తిరుమలను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఎంతదూరమైనా వెళతామని శ్రీనివాసానంద సరస్వతి స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-15T18:24:55+05:30 IST