బ్యాడ్మింటన్ పోటీల రిఫరీగా శ్రీనివాసరావు ఎంపిక
ABN , First Publish Date - 2020-02-20T09:09:59+05:30 IST
ఒడిసాలోని భువనేశ్వర్లో 21 నుంచి నిర్వహించే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2020 లో బ్యాడ్మింటన్ పోటీల రిఫరీగా
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 19:
ఒడిసాలోని భువనేశ్వర్లో 21 నుంచి నిర్వహించే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2020 లో బ్యాడ్మింటన్ పోటీల రిఫరీగా అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన పాయసం శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియామక ఉత్తర్వులు అందచేసింది. జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన శ్రీనివాసరావును బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొడాలి తనూజ, చుండ్రు గోవిందరాజు, కోశాధికారి రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, గౌరవాధ్యక్షుడు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, కోనసీమ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనా రాయణరాజు(చైతన్యరాజు), బీవీసీ విద్యాసంస్థల అధినేత బోనం కనకయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ తదితరులు అభినందించారు.