ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-06-27T21:50:31+05:30 IST

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలకోసం వచ్చే నెల 3 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 60 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 వ తరగతి.. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ హోదాలలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. లక్షా ఎనభై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు వార్షిక వేతనాలతో ఈ నియామకాలు జరుగుతాయన్నారు. తెలంగాణా వచ్చాకనే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. హన్వాడలో ఫుడ్ పార్క్ వస్తుందని, కానీ కొంత మంది భూ నిర్వాసితులను గొడవలకు పురి గొలిపే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేళా తర్వాత పోలేపల్లి సెజ్‌లో కూడా జాబ్ మేళా పెట్టి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే చించొలి - భుత్పుర్ రోడ్ వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. 

Updated Date - 2022-06-27T21:50:31+05:30 IST