పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడండి: శ్రీనివాస్ గౌడ్
ABN , First Publish Date - 2021-11-12T20:44:15+05:30 IST
ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
మహబూబ్నగర్: ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పడు ప్రధాని మోదీ, సుష్మ స్వరాజ్ జిల్లాకు వచ్చి పాలమూర్ ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని అన్నారని, కానీ గెలిచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అన్నీ మర్చిపోయారని దుయ్యబట్టారు. ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో వాటినే పండిస్తామని తెలిపారు. ఏ విషయంలో రాజకీయం చేసినా రైతుల విషయంలో చేయెద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.