పీజేఆర్కు మద్దతివ్వలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ABN , First Publish Date - 2020-08-08T22:38:40+05:30 IST
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉత్తమ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉత్తమ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాడు పీజేఆర్ ఒక్కరే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించారు..కనీసం ఆయనకు మద్దతివ్వలేదని గుర్తుచేశారు. కేంద్రం వద్దన్నా ఏపీ టెండర్లు పిలవడం వల్లే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. ఏపీ జీవోలు రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ వేశాం..పెడర్థాలు తీయొద్దని సూచించారు. ఇంప్లీడ్ అవ్వండి.. కానీ రాజకీయం చేయొద్దని మంత్రి చెప్పారు. దక్షిణ, ఉత్తర తెలంగాణ తేడా లేదు..తమకు తెలంగాణ అంతా ఒక్కటేనని పేర్కొన్నారు. కృష్ణా మొత్తం తెలంగాణ నుంచే ప్రవహిస్తోంది..ఏం చేయాలో తమకు తెలుసన్నారు. ఏపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాం..దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.