AP News: ‘వరద బాధితులకు నిత్యావసరాలు ఇవ్వలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమి చేస్తారు?’
ABN , First Publish Date - 2022-07-26T18:01:35+05:30 IST
సీఎం జగన్ పర్యటనపై టీడీపీ పోలవరం ఇంచార్జ్ బొరగం శ్రీనివాస్ విమర్శలు చేశారు.
ఏలూరు జిల్లా (Eleuru Dist.): ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పర్యటనపై టీడీపీ (TDP) పోలవరం ఇంచార్జ్ బొరగం శ్రీనివాస్ (Boragam Srinivas) విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 14 రోజుల నుంచి ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం జగన్ ప్రోగ్రాంతో డిప్యూటీ సీఎం హడా విడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు ఇవ్వలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం ఉన్నది పేరు కేనా? అంటూ రెండు ముంపు మండలాల ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. నిజంగా సీఎం పర్యటన ఉంటే.. ముఖ్యమంత్రి ఆ బురదలో తిరగాలని, అప్పుడే వాళ్ళ బాధలు తెలుస్తాయని బొరగం శ్రీనివాస్ అన్నారు.