వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని కల్యాణం
ABN , First Publish Date - 2020-06-03T10:36:17+05:30 IST
శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.
శ్రీముఖలింగం (జలుమూరు) జూన్ 2: శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు బంకుపల్లి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల సంఘం అధ్యక్షుడు పెద్దలింగన్న నేతృత్వంలో స్వామి కల్యాణం కనులపండువగా చేపట్టారు. ముందుగా శాశ్వత ఆలయ ధర్మకర్త పర్లాకిమిడి మహారాజు పేరున పూజలుచేసి అభిషేకం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పూలు, నూతన వస్త్రాలతోను అలంకరించి మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కల్యాణం చేపట్టారు. అలాగే పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో ఎన్.వి.రమణయ్య, అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహ స్వామి వారికి..
శ్రీముఖలింగం ప్రధాన ఆలయం తూర్పు దిక్కున ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కూడా మంగళవారం ఘనం గా నిర్వహించారు. అర్చకుడు విశ్వనాథదాస్ నేతృత్వంలో లక్ష్మీ సహిత నరసింహస్వామి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా...
నరసన్నపేట: జమ్ము శ్రీగణేష్, షిర్డీసాయి శ్రీరామ మందిరంలో సీతారాముల కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు మావుడూరి జగ దీష్బాబు, సత్యనందం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యా హవచనం, పంచగవ్యం, రక్షధారణ, సకల దేవతా హోమాలు నిర్వహించి కల్యాణం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాన గోవిందరాజులు, డా. రెడ్డి సంధ్య పాల్గొన్నారు.