వ్యవసాయ వర్శిటీని సందర్శించిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్
ABN , First Publish Date - 2021-09-29T22:31:12+05:30 IST
శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డార్టర్ వెంకటేశ్వరన్ బుధవారం నగరంలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
హైదరాబాద్: శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డార్టర్ వెంకటేశ్వరన్ బుధవారం నగరంలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రాజేంద్ర నగర్లోని యూనివర్శిటీ ప్రాంగణంలోని పలు పరిశోధనా విభాగాలను ఆయన సందర్శించారు. యూనివర్శిటీలో ఇటీవల ప్రారంభమైన అగ్రి ఇన్నోవేషన్ హబ్ను కూడా వెంకటేశ్వరన్ సందర్శించారు. విశ్వ విద్యాలయ రిజిస్ర్టార్ డా. సుధీర్ కుమార్, పరిశోధనా సంచాలకులు డా. జగదీశ్వర్ ఆయనకు విశ్వవిద్యాలయ కార్యకలాపాలను వివరించారు. అలాగే అగ్రి ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు, దాని ద్వారా చేపట్టే కార్యకలాపాలను ఆయనకు వివరించారు.
అగ్రిహబ్ మోడల్ను వెంకటేశ్వరన్ ఈ సందర్భంగా అభినందించారు. ఇటువంటి నమూనా శ్రీలంకలో ఉన్నవ్యవసాయ నవక కల్పనలు ఎంటర్ ప్రెన్యూర్షిప్ను మెరుగు పరుస్తుందన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న వివిధ పరిశోధనా కార్యక్రమాలను శ్రీలంక లోనూ అమలు జరిపేందుకు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఎక్సేంజ్ కార్యక్రమాలు కూడా చేపడితే బాగుంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అగ్రిహబ్ అధికారులతో సమావేశం అయ్యారు.