శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-25T04:57:54+05:30 IST
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం
పరిగి: పట్టణంలో కొత్తగా నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహ, ధ్వజస్థంభన కార్యక్రమాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రంశ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి దేవాలయం వరకు జరిగిన ఊరేగింపు శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి దేవాలయం వరకు జరిగిన ఊరేగింపులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈఉత్సవ కార్యక్రమాలు నాలుగురోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్ పాల్గొని పూజలుచేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోమ రాంచంద్రయ్య, నాయకులు బి.ప్రవీణ్రెడ్డి, ఎస్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.