నేడు క్షీరారాముడి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2020-04-04T11:45:11+05:30 IST
శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణోత్స వాల్లో భాగంగా శుక్రవారం కల్యాణ కార్యక్రమాలను ప్రారంభించారు. అంకు రార్పణ,ధ్వజారోహణ, అగ్నిపత్రిష్ఠ వంటి కార్యక్రమాలు జరిపారు.ఈ ఏడాది కరోనా కారణంగా గత నెల 21వ తేదీ నుంచి ఆలయంలో దైవ దర్శనం నిలిపివేయడంతో అర్చకులు, కార్యాలయ సిబ్బంది మాత్రమే కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు.
పాలకొల్లు అర్బన్, ఏప్రిల్ 3 :శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి కల్యాణోత్స వాల్లో భాగంగా శుక్రవారం కల్యాణ కార్యక్రమాలను ప్రారంభించారు. అంకు రార్పణ,ధ్వజారోహణ, అగ్నిపత్రిష్ఠ వంటి కార్యక్రమాలు జరిపారు.ఈ ఏడాది కరోనా కారణంగా గత నెల 21వ తేదీ నుంచి ఆలయంలో దైవ దర్శనం నిలిపివేయడంతో అర్చకులు, కార్యాలయ సిబ్బంది మాత్రమే కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు.స్వామి కల్యాణం శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు నిర్వహించనున్నట్టు ఈవో యాళ్ళ సూర్య నారాయణ తెలిపారు.