బరిలో శ్రీకాంత్‌, సింధు, సైనా

ABN , First Publish Date - 2022-05-17T09:35:28+05:30 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది.

బరిలో శ్రీకాంత్‌, సింధు, సైనా

వైదొలగిన సాత్విక్‌ జోడీ 

నేటినుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. అయితే భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి ఈ టోర్నీ బరిలో దిగడంలేదు. థామస్‌ కప్‌ టోర్నమెంట్‌ సందర్భంగా చిరాగ్‌ గాయపడడంతో ఈ ద్వయం థాయ్‌లాండ్‌ ఓపెన్‌కు దూరం  కానుంది. ఇక..శ్రీకాంత్‌.. ఫ్రాన్స్‌ షట్లర్‌ లెవర్డెజ్‌తో తొలి రౌండ్‌లో తలపడతాడు. ప్రణయ్‌ మలేసియాకు చెందిన డారెన్‌ లియుని, సాయిప్రణీత్‌ జపాన్‌ ఆటగాడు కోకి వతనాబేని, సౌరభ్‌ వర్మ ఫ్రాన్స్‌ షట్లర్‌ టోమా పొపోవ్‌ని ఢీకొంటారు. మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌తో పీవీ సింధు, కిమ్‌ గా యున్‌ (కొరియా)తో సైనా టోర్నీని ఆరంభిస్తారు. కాగా మిక్స్‌డ్‌ డబుల్స్‌, మహిళల, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన పలు జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

Updated Date - 2022-05-17T09:35:28+05:30 IST