శ్రీకాంతాచారి జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-16T06:56:50+05:30 IST

మలి తెలంగా ణ ఉద్యమ తొలి అమరు డు శ్రీ కాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆ యన తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్‌ చేశారు.

శ్రీకాంతాచారి జయంతిని అధికారికంగా నిర్వహించాలి
శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న శంకరమ్మ

నల్లగొండటౌన, ఆ గస్టు 15:  మలి తెలంగా ణ ఉద్యమ తొలి అమరు డు శ్రీ కాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆ యన తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం శ్రీకాంతాచారి జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి శంకరమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పం పిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్‌, మనుమయ సంఘం పట్టణ అధ్యక్షుడు చొల్లేటి రమేష్‌, కాసోజు శంకరాచారి, చొక్కల్ల హరికృష్ణ, గడగోజు విజయ్‌, చిన్నోజు రాజు, మధు, రవి, యాదగిరి, రమేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:56:50+05:30 IST