ముక్కంటి ఆలయంలో నలుగురిపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-09-19T09:09:50+05:30 IST
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాళహస్తి, సెప్టెంబరు 18: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో ఆలయ ప్రధానార్చకుడు సంబంధం గురుకుల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ధనపాల్, ఇన్స్పెక్టర్లు విజయసారథి, వెంకటముని ఉన్నారు. విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రధానార్చకుడు కూడా సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో స్వామి వారి ధ్వజస్తంభానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 6న శివలింగాన్ని, నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియ్సగా తీసుకున్నారు.