బొజ్జల అంత్యక్రియల్లో పాడె మోసిన Chandrababu

ABN , First Publish Date - 2022-05-08T18:31:01+05:30 IST

బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు.

బొజ్జల అంత్యక్రియల్లో పాడె మోసిన Chandrababu

Srikalahasti: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. పాడెను మోశారు. బొజ్జలకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో బొజ్జల అంత్యక్రియలు నిర్వహించారు.


కాగా బొజ్జల కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం  హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి వాహనంలో రోడ్డు మార్గాన శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తరలించారు. గంట సేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా మధ్యాహ్నం 2.20 గంటలకు ఊరందూరుకు తరలించారు. పార్థివదేహం చూడగానే కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు భోరున విలపించడంతో గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అమెరికా నుంచి అప్పటికే ఇంటికి చేరుకున్న బొజ్జల కుమార్తె పద్మరేఖ కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకాళహస్తిలోని శుకబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అమర ఆస్పత్రి అధినేత రమాదేవి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ తదితరులు బొజ్జలకు నివాళులర్పించారు. 


Read more