స్పీకర్ తమ్మినేని పర్యటన సందర్భంగా కొట్టుకున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2020-07-12T00:04:01+05:30 IST

జిల్లాలో వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు....

స్పీకర్ తమ్మినేని పర్యటన సందర్భంగా కొట్టుకున్న వైసీపీ నేతలు

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆమదాలవలస మండలం దన్నానపేటలో ఈ ఘటన జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన సందర్భంగా గొడవ  చెలరేగడంతో రెండు వార్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు.


స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపనకు వెళ్లిన స్పీకర్‌కు ఓ వర్గం స్వాగత ఏర్పాట్లు చేసింది. అయితే మరోవర్గం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో గుర్రుగా ఉన్న ఇరువర్గాల నేతలు తమ్మినేని రాకముందే బలప్రదర్శన చేశారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్పీకర్ పర్యటనలో గందరగోళం చెలరేగింది. 

Updated Date - 2020-07-12T00:04:01+05:30 IST