Srikakulam: ఆటోను ఢీకొన్న కారు... ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-28T16:02:32+05:30 IST

జిల్లాలోని పలాస మండలం నెమలినారాయణపురం వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

Srikakulam: ఆటోను ఢీకొన్న కారు... ఆరుగురికి గాయాలు

శ్రీకాకుళం: జిల్లాలోని పలాస మండలం నెమలినారాయణపురం వద్ద శనివారం ఉదయం రోడ్డు  ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారు పలాస మండలం రెంటికోట గ్రామస్తులుగా గుర్తించారు. ఒడిస్సాలోని మంతిరెడ్డి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పలాస ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-28T16:02:32+05:30 IST