ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొని శ్రీకాకుళం వాసి మృతి
ABN , First Publish Date - 2021-10-20T04:21:05+05:30 IST
మండలంలోని మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను స్కూటర్ ఢీ కొన్న ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఒక యువకుడు దుర్మరణం చెందాడు.
నాయుడుపేట టౌన్, అక్టోబరు 19 : మండలంలోని మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను స్కూటర్ ఢీ కొన్న ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఒక యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు శ్రీకాకుళానికి చెందిన వల్లభ (33) చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామం వద్ద వెల్డర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన మోటారు సైకిల్పై నాయుడుపేటకు వస్తుండగా మార్గ మధ్యంలో మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.