నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు

ABN , First Publish Date - 2022-07-18T03:13:40+05:30 IST

ఒడిస్సాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి (Nagavali), వంశధార (VamsaDhara) నదులకు వరద ఉధృతి పెరిగింది. వంశధారకు..

నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు

శ్రీకాకుళం (Srikakulam): ఒడిస్సాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి (Nagavali), వంశధార (VamsaDhara) నదులకు వరద ఉధృతి పెరిగింది. వంశధారకు 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు గొట్టా బ్యారేజ్‌ (Gotta Barrage)కు వరద ప్రవాహం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. అటు అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ నుంచి పునరావాసాలకు తరలిస్తున్నారు. 

Updated Date - 2022-07-18T03:13:40+05:30 IST