Tomorrow సిక్కోలులో మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-26T02:18:15+05:30 IST
రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ పేరిట నిర్వహించే బస్సుయాత్ర గురువారం శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానుంది.
శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ పేరిట నిర్వహించే బస్సుయాత్ర గురువారం శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మొత్తం 17 మంది రాష్ట్ర మంత్రుల బృందం గురువారం ఉదయం శ్రీకాకుళంలో అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర కొనసాగుతుంది. సభా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు నియోజకవర్గాలవారీగా జనసమీకరణ చేపడుతున్నారు.