శ్రీకాకుళం జిల్లా: మరో ఉద్ధానంగా కిట్టాలపాడు

ABN , First Publish Date - 2022-03-12T17:54:57+05:30 IST

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి మండలం, కిట్టాలపాడు గ్రామంలో 90 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

శ్రీకాకుళం జిల్లా: మరో ఉద్ధానంగా కిట్టాలపాడు

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి మండలం, కిట్టాలపాడు గ్రామంలో 90 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులంతా కూలిపనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రామంపై కిడ్నీ వ్యాధి విరుచుకుపడింది. మరో ఉద్దానంగా మారింది. ఏ తలుపు తట్టినా.. అనారోగ్య సమస్యలతో ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారు.


ఐదేళ్లుగా కిట్టాలపాడు గ్రామాన్ని కిడ్నీ వ్యాధి పట్టి పీడుస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కాళ్లు వాచిపోయి కదలలేని స్థితిలో చాలామంది మంచంపట్టారు. గ్రామంలో ఇప్పటికే కొందరు కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడగా.. మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ మాయదారి రోగం ఎందుకు వచ్చిందో.. ఎప్పుడు పోతుందో తెలియక తల్లడిల్లుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవారి కోసం ఎదురుచూస్తున్నారు. వారానికొకరు గాల్లో కలుస్తుంటే.. దేవుడిపైనే భారం వేసి కాలం వెల్లదిస్తున్నారు.

Updated Date - 2022-03-12T17:54:57+05:30 IST