మద్యం మత్తులో మారణహోమం.. ముగ్గురిని పొట్టనబెట్టుకుని ఆపై తానూ..

ABN , First Publish Date - 2022-01-29T13:02:38+05:30 IST

ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడపేటలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం

మద్యం మత్తులో మారణహోమం.. ముగ్గురిని పొట్టనబెట్టుకుని ఆపై తానూ..

మద్యం మత్తులో దారుణానికి తెగబడ్డాడో.. మరేదైనా కుటుంబ కలహమో తెలియదు కానీ కుటుంబంపై కత్తితో అత్యంత దారుణంగా దాడి చేసి మారణ హోమం సృష్టించాడు. ఆపై తాను అత్యంత దారుణంగా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడపేటలో దారుణం జరిగింది. తన కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పన్న దాడిలో  భార్య, అత్తమ్మ, సోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T13:02:38+05:30 IST