శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు..

ABN , First Publish Date - 2021-10-11T19:58:04+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వజ్రపు కొత్తూరు మండలం, అక్కుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు..

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వజ్రపు కొత్తూరు మండలం, అక్కుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తితిలీ తుపాను బాధితులకు పరిహారం అందించడంలో జరుగుతున్న జాప్యంపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పలాస టీడీపీ ఇన్చార్జ్ గౌతు శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తదితరులు నిరసర కార్యక్రమంలో పాల్గొన్నారు.


శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నడుమ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యంగా దాడి చేసే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Updated Date - 2021-10-11T19:58:04+05:30 IST