మంత్రి అప్పలరాజుకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-04-04T20:23:20+05:30 IST
శ్రీకాకుళం జిల్లా: మంత్రి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది.
శ్రీకాకుళం జిల్లా: మంత్రి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది. సోమవారం పలాస రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. తిరిగి వెళ్తున్న మంత్రిని కేదారిపురం కౌలు రైతులు అడ్డుకున్నారు. బినామీలకు పట్టాలిచ్చారంటూ.. మంత్రి అప్పలరాజును రైతులు నిలదీశారు. దీంతో న్యాయం చేస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇవ్వడంతో కౌలు రైతులు శాంతించారు.