శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్ తిట్లదండకం వైరల్
ABN , First Publish Date - 2020-09-28T03:42:53+05:30 IST
డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ తిట్లదండకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంచిలి మండలస్థాయి నాయకుడు శేఖర్పై...
శ్రీకాకుళం: డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ తిట్లదండకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంచిలి మండలస్థాయి నాయకుడు శేఖర్పై సాయిరాజ్ ఓ రేంజ్లో ఊగిపోయారు. కంచిలిలో జరిగే పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రూ. 50 లక్షలు ఖర్చు పెట్టిన తననే పట్టించుకోరా? అంటూ సాయిరాజ్ తిట్ల దండకం చదివారు.