AP: తోటాడ పోస్టాఫీస్‌లో పోస్ట్‌మాన్‌ చేతివాటం

ABN , First Publish Date - 2021-12-13T19:13:33+05:30 IST

జిల్లాలోని ఆమదాలవలస మండలం తోటాడ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్‌మాన్ చేతివాటం చూపాడు.

AP: తోటాడ పోస్టాఫీస్‌లో పోస్ట్‌మాన్‌ చేతివాటం

శ్రీకాకుళం: జిల్లాలోని ఆమదాలవలస మండలం తోటాడ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్‌మాన్ చేతివాటం చూపాడు. బ్రాంచ్‌లో పోస్టు‌మెన్‌గా  చేస్తున్న శశికుమార్ ఫిక్స్, మంత్లీ డిపోజిట్ల ద్వారా ఖాతాదారులు కట్టిన డబ్బులను దోచుకున్నాడు. గత కొన్ని నెలలుగా మెచ్యూరిటీ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో హెడ్ పోస్టాఫీసును ఖాతాదారులు సంప్రదించారు. దీంతో పోస్టుమాన్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. కాగా మూడు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో శశికుమార్ మృతి చెందాడు. విషయం తెలిసిన ఖాతాదారులు తోటాడ బ్రాంచ్ పోస్టు కార్యక్రమం వద్ద ఆందోళన చేపట్టారు. 


Updated Date - 2021-12-13T19:13:33+05:30 IST