AP: కొబ్బరి చెట్టు విరిగిపడి యువతి మృతి
ABN , First Publish Date - 2021-12-04T16:18:30+05:30 IST
జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాదం చోటు చేసుకుంది.
శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు విరిగిపడి యువతి మృతి చెందింది. మృతురాలు గొరకల హిందుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలెవరూ ఇళ్ళు విడిచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.