Srikakulam: మద్యం మత్తులో దారుణం

ABN , First Publish Date - 2022-06-08T13:43:19+05:30 IST

జిల్లాలోని పాతపట్నం మండలం కాపుగోపాలపురంలో దారుణం జరిగింది.

Srikakulam: మద్యం మత్తులో దారుణం

శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నం మండలం కాపుగోపాలపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిదండ్రులపై మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ బోసి శ్రీనివాసరావు దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా... తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులపై శ్రీనివాసరావు కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-08T13:43:19+05:30 IST