శ్రీకాకుళంలో విషాదం

ABN , First Publish Date - 2022-05-05T16:48:22+05:30 IST

జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది.

శ్రీకాకుళంలో విషాదం

శ్రీకాకుళం: జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వారు చింతల చిన్నమణి(తల్లి), శ్రీరంజని, జాహ్నవి, వెంకట్ సాయి సాత్విక్‌గా గుర్తించారు. ఈ ఘటనలో తల్లి చిన్నమణి, పెద్ద కూతురు జాహ్నవి మృతి చెందగా... ఎనబై శాతం కాలిన గాయాలతో ఉన్న శ్రీరంజని, వెంకట సాయి సాకేత్‌లను  శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more