Srikakulam: అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి ట్రాక్టర్
ABN , First Publish Date - 2022-05-02T15:38:33+05:30 IST
జిల్లాలోని నందిగామ మండలం కణితూరు - గోవిందపురం మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం కణితూరు - గోవిందపురం మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు లఖిదాసుపురం గ్రామానికి చెందిన డ్రైవర్ బొంగి వంశీకృష్ణ , గున్న అజయ్ కుమార్గా గుర్తించారు. ఆదివారం రాత్రి పూండిలో ఇటుకల లోడు తీసుకువెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.