మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్పాయిజన్
ABN , First Publish Date - 2022-04-12T12:48:15+05:30 IST
జిల్లాలోని మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్పాయిజన్ జరిగింది.
శ్రీకాకుళం: జిల్లాలోని మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్పాయిజన్ జరిగింది. దాదాపు 9 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి భోజనం తర్వాత స్టూడెంట్స్ కళ్లు తిరిగి పడిపోయారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు బాధపడుతున్నారు. అయితే కలుషిత ఆహారమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినిలకు చికిత్స కొనసాగుతోంది.