వైభవంగా శ్రీగోదా రంగనాథ స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-16T05:47:28+05:30 IST

వైభవంగా శ్రీగోదా రంగనాథ స్వామి కల్యాణం

వైభవంగా శ్రీగోదా రంగనాథ స్వామి కల్యాణం
స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

  •  పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ : పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌ సమీపంలోని శ్రీగోదా సమేత రంగనాథ స్వామి కళ్యాణోత్సం కనుల పండువగా జరిగింది. సంక్రాంతి పండుగ పర్వదిననా స్వామి వారి కల్యాణం సందర్భంగా కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్ని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి. వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియా నాయక్‌, కౌన్సిలర్లు నర్రి ధనలక్ష్మి, గోంగళ్ల మహేష్‌, చింతల రాజశేఖర్‌, బండారి శ్రీనివా్‌సగౌడ్‌, నర్రి శ్రీశైలం, బొక్క బుచ్చిరెడ్డి, దర్శన్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:47:28+05:30 IST