కరోనాతో శ్రీదేవి నర్సింగ్ హోం అధినేత వెంకటరమణ ప్రసాద్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-03T14:50:34+05:30 IST
శ్రీదేవి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ కొవెలమూడి వెంకట రమణప్రసాద్ (84) కన్నుమూశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
బౌద్ధనగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): శ్రీదేవి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ కొవెలమూడి వెంకట రమణప్రసాద్ (84) కన్నుమూశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అపోలో ఆస్పత్రుల గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ తండ్రి రమణప్రసాద్. ఆయన మరణ వార్త తెలియడంతో వారాసిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణాజిల్లా, కంకిపాడు తాలూకా, పూలవేలు గ్రామానికి చెందిన ప్రసాద్ ఎంబీబీఎస్ చేశారు. 1974లో వారాసిగూడలో శ్రీదేవి నర్సింగ్ హోం స్థాపించారు. డాక్టర్ ప్రసాద్కు భార్య పూర్ణిమ, కుమారుడు హరిప్రసాద్, కోడలు సుమ, కుమార్తెలు సుస్మిత, శ్రీదేవి, అల్లుళ్లు అప్పాజీ, రామకృష్ణ ఉన్నారు.