శ్రీభాగ్యరెడ్డి వర్మ తొలి దళిత ఉద్యమకారుడు

ABN , First Publish Date - 2022-05-23T06:07:34+05:30 IST

దక్షిణ భారతదేశంలో తొలి దళిత ఉ ద్యమకారుడిగా చెప్పకోదగిన వ్యక్తి శ్రీభాగ్యారెడ్డి వర్మ అని అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

శ్రీభాగ్యరెడ్డి వర్మ తొలి దళిత ఉద్యమకారుడు
శ్రీభాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రశేఖర్‌

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ 

నల్లగొండటౌన, మే 22: దక్షిణ భారతదేశంలో తొలి దళిత ఉ ద్యమకారుడిగా చెప్పకోదగిన వ్యక్తి శ్రీభాగ్యారెడ్డి వర్మ అని అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శ్రీ భాగ్యరెడ్డివర్మ 134వ జయంతి ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా షెడ్యూల్‌ అభివృద్ధి శాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అ ణగారిన కులాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీ యమని పేర్కొన్నారు. అలాంటి మహానీయుడి జయంతిని ప్రభు త్వపరంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహనీయుల జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఇనచార్జి డి ప్యూటీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో హైదరాబాద్‌ సంస్థానంలో 24 దళిత బాలికల పాఠశాలలు స్థాపించి బా ల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. తెలంగాణలో జోగిని, దే వదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన ఈడీ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ ఈఈ తిరుపతయ్య, ఎస్సీ వెల్ఫేర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ జైపాల్‌, ఏఎ్‌సడబ్ల్యూవో కరుణశ్రీ, హెచడబ్ల్యూవోలు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:07:34+05:30 IST