గంట వ్యవధిలో మైనర్ బాలిక Kidnapను చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-21T21:01:32+05:30 IST

శ్రీ సత్యసాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్‌ను గంట వ్యవధిలోనే పోలీసులు చేధించారు.

గంట వ్యవధిలో మైనర్ బాలిక Kidnapను చేధించిన పోలీసులు

Sri Sathyasai: జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ (Kidnap) కలకలం రేపింది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు (Police) చేధించారు. భోగినే పల్లికి చెందిన మైనర్ బాలికను చియ్యేడు గ్రామానికి చెందిన యువకుడు కారులో కిడ్నాప్ చేశాడు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి మైనర్ బాలిక  సమీప బంధువు సదానందగా తెలియవచ్చింది. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ అపహరించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఇటుకలపల్లి  పోలీసులు.. అనంతపురం నగరం, తపోవనంలో కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులతో పాటు మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. గంట వ్యవధిలోనే కిడ్నాపర్ల నుంచి మైనర్ బాలికను కాపాడడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో పోలీసులు స్పందించడంతోనే తమ కూతురు ప్రాణాలతో బయట పడిందని తల్లిదండ్రులు అన్నారు.

Updated Date - 2022-06-21T21:01:32+05:30 IST