మాల్దీవుల నుంచి సింగపూర్‌కు పరారైన Rajapaksa కుటుంబం!

ABN , First Publish Date - 2022-07-14T23:57:56+05:30 IST

సింగపూర్: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవుల నుంచి నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు.

మాల్దీవుల నుంచి సింగపూర్‌కు పరారైన Rajapaksa కుటుంబం!

సింగపూర్: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ Rajapaksa మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే Rajapaksa తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.  






మరోవైపు గొటబయ Rajapaksa ఇంకా శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఈ నెల 13న రాజీనామా చేస్తానని మాటిచ్చిన ఆయన మాట తప్పారు. రాజీనామా ఇవ్వకుండానే దాగుడుమూతలాడుతున్నారు. రాజీనామా చేస్తే తనను అరెస్ట్ చేసే అవకాశాలుండటంతో ఆయన రాజీనామాకు వెనుకాడుతున్నారని సమాచారం. అరెస్టు తప్పించుకోవడంతో పాటు ఇతర విశేషాధికారాలను ఉపయోగించుకునేందుకు ఆయన రాజీనామా వాయిదా వేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రణిల్ విక్రమసింఘే ప్రజాందోళనలను అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. 



Updated Date - 2022-07-14T23:57:56+05:30 IST