వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం

ABN , First Publish Date - 2021-04-22T06:06:16+05:30 IST

శ్రీరామ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం
సంపత్‌నగర్‌ శారదాపీఠంలో మంగళసూత్రాలను భక్తులకు చూపుతున్న అర్చకులు

గుంటూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 21: శ్రీరామ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మూలవిరాట్‌లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణ నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో దంపతులచే స్వామి ఉత్సవమూర్తులకు అభిజిత్‌ లగ్నంలో కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొన్ని ఆలయాలలో పట్టాభిషేకాన్ని నిర్వహించారు. 

కొరిటెపాడు కోదండరామాలయంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మారుతీనగర్‌ మారుతీదేవాలయం, ఇన్నర్‌ రింగురోడ్డు రామాలయం, ఆర్‌.అగ్రహారం వెంకటేశ్వర స్వామి ఆలయం, ఏలూరుబజార్‌ రామమందిరం, చౌత్రా రామాలయం, స్తంభాలగరువు, బృందావన్‌ గార్డెన్స్‌, ఎస్‌వీఎన్‌ కాలనీ, వెంకటేశ్వర స్వామి ఆలయం, గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం, సంపత్‌నగర్‌ రామనామక్షేత్రం, శారదాపీఠం, శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయం తదితర ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించారు. 



Updated Date - 2021-04-22T06:06:16+05:30 IST