పోలీసు కస్టడీకి బిట్టు శీను

ABN , First Publish Date - 2021-02-27T23:03:52+05:30 IST

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును

పోలీసు కస్టడీకి బిట్టు శీను

మంథని: న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి మంథని కోర్టు అనుమతించింది. న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో A4గా  బిట్టు శ్రీను ఉన్నాడు. దీంతో శ్రీను విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంథని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు శ్రీనును ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బిట్టు శ్రీనును లోతుగా పోలీసులు విచారించనున్నారు. జంట హత్యల కేసులో నిందితులకు ఆయుధాలు, వాహనాన్ని బిట్టు శ్రీను సమకూర్చాడు. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు. 

Updated Date - 2021-02-27T23:03:52+05:30 IST