వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ

ABN , First Publish Date - 2022-08-13T07:05:04+05:30 IST

తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణపౌర్ణమి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణపౌర్ణమి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.చల్లటివాతావరణంలో గోవిందనామస్మరణలు, కర్పూర హారతులు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ వాహన సేవ కన్నులపండువగా జరిగింది. చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T07:05:04+05:30 IST