ఎస్‌కేఎంఎల్‌ సాకర్స్‌పై స్పోర్ట్సుమన్‌ విజయం

ABN , First Publish Date - 2021-10-20T07:01:28+05:30 IST

పోలీసు బ్యారక్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న అత్తిలి సూరిబాబు, అత్తిలి పైడికొండ స్మారక సీనియర్‌ ఫుట్‌బాల్‌ నాకౌట్‌ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్పోర్ట్సుమన్‌ 2-1 గోల్స్‌ తేడాతో ఎస్‌కేఎంఎల్‌ సాకర్స్‌పై విజయం సాధించింది. ఆట తొలి భాగం 12వ నిమిషంలో స్పోర్ట్సుమన్‌ స్ట్రయికర్‌ ఆశ్రాయ్‌ గోల్‌ సాధించాడు.

ఎస్‌కేఎంఎల్‌ సాకర్స్‌పై స్పోర్ట్సుమన్‌ విజయం
ఇరు జట్ల ఆటగాళ్లను అభినందించిన అతిథులు కన్నబాబు, సీనియర్‌ ఫుట్‌బాలర్‌ అప్పారావు

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 19: పోలీసు బ్యారక్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న అత్తిలి సూరిబాబు, అత్తిలి పైడికొండ స్మారక సీనియర్‌ ఫుట్‌బాల్‌ నాకౌట్‌ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్పోర్ట్సుమన్‌ 2-1 గోల్స్‌ తేడాతో ఎస్‌కేఎంఎల్‌ సాకర్స్‌పై విజయం సాధించింది. ఆట తొలి భాగం 12వ నిమిషంలో స్పోర్ట్సుమన్‌ స్ట్రయికర్‌ ఆశ్రాయ్‌ గోల్‌ సాధించాడు. రెండో భాగం ప్రారంభంలో ఆశ్రాయ్‌ మరో అద్భుతమైన గోల్‌ చేసి జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. మ్యాచ్‌ చివరి నిమిషంలో ఎస్‌కేఎంఎల్‌ఎస్‌సీ ఆటగాడు నవీన్‌ సాధించిన గోల్‌ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించడానికి పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. మంగళవారం జరిగిన మ్యాచ్‌కు ఏఎస్‌ఎంఎఫ్‌సీ మాజీ అధ్యక్షుడు కన్నబాబు, పోర్టు ట్రస్టు సీనియర్‌ ఫుట్‌బాలర్‌ పి.అప్పారావులు ముఖ్య అతిఽథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు. కాగా మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన ఎస్‌కేఎంఎల్‌ఎస్‌సీ ఆటగాడు నవీన్‌కు బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును రైల్వే జట్టు గోల్‌ కీపర్‌ గణేశ్‌ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు జగన్నాథరావు, ఎస్‌జీ రామకృష్ణ, గోవింద్‌,  రాజారావు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T07:01:28+05:30 IST