ఆ ముగ్గురి క్వారంటైన్ పొడిగింపు!
ABN , First Publish Date - 2022-02-10T09:06:57+05:30 IST
ఆ ముగ్గురి క్వారంటైన్ పొడిగింపు!
ముంబై నుంచి క్రైస్ట్చర్చ్ చేరుకున్న భారత జట్టు న్యూజిలాండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 రోజులు క్వారంటైన్లో ఉంది. అయితే అది ముగిసినా ఓపెనర్ స్మృతి మంధాన, పేసర్లు మేఘనా సింగ్, రేణుకా సింగ్ క్వారంటైన్ పొడిగించడంతో వారు కరోనా బారినపడ్డారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై జట్టు యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. క్వారంటైన్ పొడిగింపు ఎన్ని రోజులనేది కూడా వెల్లడి కాలేదు. దాంతో బుధవారంనాటి టీ20 మ్యాచ్కు దూరంగా ఉన్న మంధాన..ఐదు వన్డేల్లో భాగంగా శనివారం జరిగే మొదటి మ్యాచ్కు కూడా ఆడకపోవచ్చు.