గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు!
ABN , First Publish Date - 2022-05-15T08:46:52+05:30 IST
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఎకరం నుంచి ఎకర న్నర స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఎకరం నుంచి ఎకర న్నర స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం స్థలాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా స్థలాలను చదును చేసి, క్రీడలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 18న సీఎం కేసీఆర్ దీనిపై సమీక్ష చేయనున్నారు. స్థలాల గుర్తింపు పురోగతిపై ఈనెల 16న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు.