క్రీడలు మంచి వ్యాయామాన్ని ఇస్తాయి
ABN , First Publish Date - 2022-01-21T06:11:36+05:30 IST
క్రీడలు మంచి వ్యాయామాన్ని అందిస్తాయని ట్రాన్సకో ఎస్ఈ అప్పారావు పే ర్కొన్నారు.
అనంతపురంరూరల్, జనవరి20: క్రీడలు మంచి వ్యాయామాన్ని అందిస్తాయని ట్రాన్సకో ఎస్ఈ అప్పారావు పే ర్కొన్నారు. గురువారం పీటీసీలో ట్రాన్సకో ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీలను ఆయన ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే అధికారులకు, ఉద్యోగులకు క్రీడలు ఆట విడిపులాంటివన్నారు. అనంతరం జరిగిన క్రికెట్ పోటీల్లో కళ్యాణ దుర్గం, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. ఇందులో కళ్యాణదుర్గం జట్టు విజయం సాధించింది. అలాగే 54ఏళ్లు దాటిన ఉద్యోగులు, అధికారుల వెటరన క్రికెట్ పోటీల్లో ఎంఆర్టీ జట్టు గెలుపొందింది. విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని ఎస్ఈ తెలిపారు.