క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
ABN , First Publish Date - 2021-11-28T05:21:56+05:30 IST
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
శంషాబాద్ రూరల్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని బీజేపీ సీనియర్ నేత బుక్క వేణుగోపాల్ అన్నారు. శనివారం నర్కూడ అమ్మపల్లి గ్రౌండ్లో జరిగిన ఎన్పీఎల్ క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడకారులకు ప్రభుత్వ ప్రోత్సహం కరువైందని విమర్శించారు. నర్కూడ లయన్స్ టీం విన్నర్గా నిలిచింది. కార్యక్రమంలో కుమార్యాదవ్, గోపాల్, కుమార్, క్రీడకారులు పాల్గొన్నారు.