క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: ఎంపీపీ
ABN , First Publish Date - 2022-07-04T05:49:18+05:30 IST
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: ఎంపీపీ
శంషాబాద్ రూరల్, జూలై 3: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అన్నారు. పెద్దతూప్రలో ఆదివారం తుప్పర లీగ్ చాంపియన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొత్తం ఆరు జట్లు పాల్గొనగా అందులో రెండుజట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్లో సోల్ టేకర్ విన్నర్గా నిలిచింది. రన్నర్గా బ్లాక్ టైగర్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన జయమ్మ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటుములు సమానంగా స్వీకరించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. గ్రామీణ యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డుమెంబర్స్ రవి, అశోక్, బిక్యానాయక్, కుమార్యాదవ్, మల్లారెడ్డి, రాజు, డి.సాయిబాబా, ప్రవీణ్, శేఖర్, నారాయణ, గణేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.