సౌత్జోన్ పోటీలకు జీఎంసీ విద్యార్థి ఎంపిక
ABN , First Publish Date - 2021-12-04T05:51:44+05:30 IST
దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ (పురుషులు) టోర్నమెంటుకు గుంటూరు వైద్య కళాశాల 2కే20 మ్యాచ్కు చెందిన బి.రాహుల్ ఎంపికయ్యారు.
గుంటూరు(మెడికల్), డిసెంబరు 3: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ (పురుషులు) టోర్నమెంటుకు గుంటూరు వైద్య కళాశాల 2కే20 మ్యాచ్కు చెందిన బి.రాహుల్ ఎంపికయ్యారు. డిసెంబరు 6 నుంచి 10 వరకు వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. కాగా గురువారం జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ పద్మావతి దేవి, స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ జే రాము తదితరులు మెడికో రాహుల్ను అభినందించారు.