ఇంట్లో ఉంటారా.. జైలుకు వెళ్తారా?
ABN , First Publish Date - 2020-03-24T10:35:16+05:30 IST
ఇంట్లో ఉంటారా.. జైలుకు వెళ్తారా?
న్యూఢిల్లీ: కర్ఫ్యూ విధించినా స్వేచ్ఛగా తిరుగుతున్నవారు భద్రంగా ఉంటారో లేక జైలుకు వెళతారో? నిర్ణయించుకోవాలని ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఆదివారం జనతా కర్ఫ్యూలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు మర్నాడే రోడ్లపైకి వచ్చారు. ‘ఈ పోరాటం బతుకుదెరువు కోసం కాదు.. మన మనుగడ కోసం జరుగుతోంది. దయచేసి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను పాటించండి’ అని గంభీర్ కోరాడు. కాగా.. ఢిల్లీలో కరోనా వైరస్ చికిత్స కోసం అవసరమైన వైద్య పరికరాల కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్టు గంభీర్ తెలిపాడు.