కర్ఫ్యూ రోజు.. క్రికెట్‌ ఆడుతున్న 8 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-03-24T10:33:56+05:30 IST

కర్ఫ్యూ రోజు.. క్రికెట్‌ ఆడుతున్న 8 మంది అరెస్టు

కర్ఫ్యూ రోజు.. క్రికెట్‌ ఆడుతున్న 8 మంది అరెస్టు

ముంబై: కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపు మేరకు ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిం చింది. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అయితే, సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిం చిన కొందరు.. కల్యాణిలోని ఓ మైదానంలో క్రికెట్‌ ఆడారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై విపత్తుల చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-24T10:33:56+05:30 IST