మురిగిపోయిన కోడిగుడ్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-12T07:18:41+05:30 IST
మండలంలోని వగ్గంపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన కోడిగుడ్ల మురిగిపోయాయి.
పామూరు, మే 11 : మండలంలోని వగ్గంపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన కోడిగుడ్ల మురిగిపోయాయి. కోడిగుడ్లను తీసుకెళ్లిన వారు కరోనా సమయం కావడంతో కడుగుదామని నీళ్లలో వేయగా అవి తేలుతున్నాయి. అనుమానం వచ్చి పగలగొట్టి చూస్తే మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.